ఆంధ్రప్రదేశ్ లో గంజాయి స్మగింగ్ యదేచ్చగా సాగుతోంది. ఈ ప్రభావం ఇక్కడ యువత జీవితాలపై తీవ్రంగా చూపుతోంది. సరిహద్దు రాష్ట్రాలలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఆంధ్రా నుంచే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇపుడు తాజాగా విశాఖ పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన కంటైనర్లలో 25 వేల కిలోల మాదక ద్రవ్యాలను సీబీఐ అధికారులు గుర్తించారు. వీటి విలువ లెక్కిస్తే.. 50 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రాములు, వందల గ్రాములలో మాత్రమే పట్టుబడే మాదక ద్రవ్యాలు కిలోలు కాదు.. వందల కిలోలు కాదు.. ఏకంగా వేల కిలోలలో దొరికాయ్. విశాఖపట్నాన్ని జగన్ పరిపాలనా రాజధానిగా పెట్టడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. న్యాయస్థానాలు చెపుతున్నా.. కోర్ట్ ధిక్కారణ అయినా పాలకులు, అధికారులు లెక్క చేయకుండా.. విశాఖ తరలిపోయేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు.
విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ వైసీపీ ఇంచార్జ్ గా కొన్నేళ్లు బాధ్యతలలో ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి… కొన్నాళ్ల క్రితం ..బ్రెజిల్ అధ్యక్షుడుకి ట్విట్టర్ లో విషెస్ చెప్పారు. ఒక ఎంపీ ఓ దేశ అధ్యక్షుడికి ఇలా విశేష్ చెప్పడమేంటి అని ఆ సమయంలో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కొన్ని నెలల తర్వాత బ్రెజిల్ నుంచి వచ్చిన షిప్ లోనే 25 వేల కిలోల మాదక ద్రవ్యాలు లభ్యం కావడం రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది.
”విజయసాయి పెట్టిన విషెస్ కారణాలు, బ్రెజిల్ అధ్యక్షుడి, బ్రెజిల్ లో విజయసాయి కి ఉన్న పరిచయాలపై కూడా సీబీఐ విచారణ చేయాలి..”అని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయ్. సీబీఐ దీనిని పరిగణలోకి తీసుకుంటే మరిన్ని బాగోతాలు వెలుగుచూసే అవకాశం ఉంది..