2019 ఎన్నికల ముందు.. వివేకానంద్ రెడ్డి హత్య ముఖ్య0గా రాయలసీమలో వైసీపీకి బాగా ఉపయోగపడిందని విశ్లేషకులు అప్పట్లోనే అంచనా వేశారు. అప్పటి సీఎం చంద్రబాబుపై ప్రముఖ0గా జగన్ అభాండాలు వేసేరు. వాటిని సీమ ప్రజలు చాలా వరకు నమ్మబట్టే జగన్ కి సీఎం అయ్యేందుకు ఈ మర్డర్ ఇస్యూ కూడా ఉపయోగపడింది.
2024… ఎన్నికలకు కూడా రాయలసీమలో వైఎస్ వివేకా మర్డర్ మరో రాజకీయ ప్రభావిత అంశం కాబోతోందా? వివేకా హత్య జరిగి ఐదేళ్లు దాటుతున్నా… కేసు ఇంకా కొలిక్కి రాలేదు. దోషులు తప్పించుకు తిరిగుతున్నారు. జగన్ కజిన్ , కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణల నేపధ్యంలో వివేకా కుటుంబ సభ్యులే ఎటాక్ చేస్తున్నారు. అయినా జగన్ జంకకుండా 2024 కడప పార్లమెంట్ సీటును కూడా అవినాష్ నే పోటీ చేయిస్తున్నారు.
షర్మిల, సునీత ఇద్దరు రాయలసీమలో …వివేకా మర్డర్ పై విస్తృత ప్రచారం చేస్తున్నారు. వివేకా హంతకులకు జగన్ రక్షణ కల్పిస్తున్నారని, తిరిగి కడప ఎంపీ సీటు ఇచ్చారని కూడా షర్మిల ఘాటైన విమర్శలే చేస్తున్నారు. అయితే వీటిపై అక్కడి జనంలో స్పందన ఎలా ఉందనేది బహిర్గతం కావడంలేదు. వివేకానంద్ రెడ్డి హత్యలో కీలక సూత్రదారులు, వారికి దన్నుగా నిలబడి కాపాడుతున్న వారు చట్టం ప్రకారం బయటపడకపోయినా.. దాదాపు కొందరిపైనే సీమ జనం వేలెత్తి చూపుతున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం జంకకుండా బొంకుతునే ఉన్నారు. ”వివేకాను ఎవరు హత్య చేసారో దేవుడికి తెలుసు..” అంటూ జగన్ పదే పడే ప్రస్తావిస్తూనే ఉన్నారు. నిజంగా దేవుడు వివేకాను హత్య చేసిన వారు, చేయించిన వారు, వారిని కాపాడుతున్న వారిని శిక్షించాలని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
ఎన్నికలలోగా వివేకా మర్డర్ కేసు కోర్ట్ ప్రకారం శిక్ష పడకపోయినా .. దేవుడి నిజంగా వాళ్లందరికీ తగిన శిక్ష వేస్తే దేవుడిపై అన్ని మతాలలోను మరింత నమ్మకం పెరుగుతుంది. అయితే కాస్త అటు.. ఇటు అవ్వొచ్చ కానీ, మర్డర్ చేసిన, చేయించిన, సపోర్ట్ చేస్తున్న వారికి సమయం.. కాస్త లేట్ అయినా దేవుడి నుంచి తప్పించుకొలేరు.