తెలంగాణ ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టి కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉంటుందా? ఎన్నికల ఖర్చును తట్టుకోగలిగే కెపాసిటీ ఉందా?
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ ఫామిలీ తహతహలాడుతోంది. అనుకోకుండా కాంగ్రెస్ అనతికాలంలోనే పుంజుకోవడంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కి మంచి హైప్ వచ్చింది. పలు సర్వేలు సైతం కాంగ్రెస్ జెండా పాతడం ఖాయం అంటూ చెపుతున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రా ఓటర్లు కూడా కాంగ్రెస్ కి మద్దతు పలుకుతాయన్నది కాదనలేని నిజం.
జగన్ పార్టీకి ముందు నుంచీ కెసిఆర్ అండగా నిలబడటం.. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడానికి కెసిఆర్ సహకారం జగన్ మరువలేదు. ఇందుకు బదులుగా ఇతను కూడా కెసిఆర్ కి సహకారం అందిస్తున్నారు.
బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. కేసీఆర్ తో , కేంద్రం పెద్దలు లోపాయికారి ఒప్పందం పెట్టుకోవడాం ద్వారా.. సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి తెలంగాణ బాధ్యతలు అప్ఫగించడం ద్వారా… బీజేపీని ఎన్నికల బరిలో నుంచి వెనక్కి తగ్గించి.. బీఆర్ఎస్ కి పరోక్షంగా సపోర్ట్ గా నిలిచారు.
ఇదే సమయంలో జనసేన , బీజేపీతో చేతులు కలిపింది. పవన్ కూడా తెలంగాణలో 8 చోట్ల అసెంబ్లీ కి పోటీకి తమ అభ్యర్థులను దించారు. అయితే ఆ 8 లో ఒక చోట కూడా గెలిచే పరిస్థితి కనిపించడంలేదు. పైగా బీజేపీకి పవన్ మద్దతు ఇస్తున్నా.. వాళ్ళు కూడా 10 సీట్ల లోపే గెలిచే పరిస్థితి కనిపిస్తోంది.
కేసీఆర్ కుటుంబ పాలనపై తెలంగాణ సమాజంలో వ్యతిరేఖత వచ్చినా,, కాంగ్రెస్ ని గెలిపించే0త వ్యతిరేఖత వచ్చిందా? అంటే చెప్పలేం. అయితే కొన్ని సర్వేలు కాంగ్రెస్ ని హైప్ చేస్తున్నాయ్. గ్రామీణ తెలంగాణలో ఇంకా కేసీఆర్ ని నమ్మే జనం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎన్నోకొని సీట్లు ఎక్కువ తెచ్చుకోగలదు . కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే.. బీఆర్ఎస్ కి ఆర్ధిక వనరుల కొరతలేదు. ఇది కూడా ఎన్నికలలో ఎంతోకొంత ప్రభావం చూపనుంది. వీటన్నింటినీ పరిశీలిస్తే అరకొర మెజార్టీతో బీఆర్ఎస్ మూడోసారి అధికార పీఠం దక్కించుకోవచ్చు.