” అక్రమ ఆస్తుల కేసులో పదేళ్ల నుంచి బెయిల్ పై ఉన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి..” అంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్ట్ జగన్ కి నోటీసులు జారీ చేసారు. పదేళ్లుగా కోర్టుకి హాజరుకాకుండా ఉండటానికి ..సీబీఐ- జగన్ ఫ్రెండ్లీ మ్యాచ్ గా ఉన్నట్లు రఘురామ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
3041 సార్లు పదేళ్లలో వాయిదాలు వేసి.. జగన్ కి రిలీఫ్ ఇచ్చినట్లు సీబీఐ మీద కూడా రఘు రామ పిటిషన్ లో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు అనుమానాలు రేకెత్తుతాయని కూడా రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
కేసును 2024 జనవరి మొదటివారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గతంలో రఘురామ జగన్ బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు లో వేశారు. తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో RRR సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.