”చట్టం తన పని తాను చేసుకుపోతుంది..” అనేది చాలా సందర్భాలలో జరగదు. అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడం, ఆర్ధికంగా, రాజకీయంగా, ఇతరత్రా సంతోషపెట్టడం వంటి అనైతికాలతో ఎంతటి దుర్మార్గాలు, పాపాలకు ఒడిగట్టినా చట్టం నుంచి తప్పించుకునేందుకు ఛాన్స్ దొరుకుతుంది. అయితే వీళ్ళు పాల్పడే దుర్మార్గాలకు పై వాడు మాత్రం లెక్క తేల్చేస్తాడు… కాకపొతే దేనికైనా టైం రావాలి..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తన లాబీయింగ్ ఉపయోగించి తప్పించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శత విధాలా యత్నించాడు. ఇంకా బలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
”అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు. అతన్ని అరెస్ట్ చేయాలి..” అని సీబీఐ ఎన్నో మార్లు చెప్తూ వస్తోంది. న్యాయస్థానాలు అందుకు ఎన్నో రోజులు అవకాశం ఇచ్చిన సీబీఐ వారు మాత్రం అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చారు. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ కూడా ఇరుక్కునే అవకాశం ఉందన్న ప్రచారం ముందు నుంచీ జోరుగా సాగుతోంది. ఈ కారణాన్ని అడ్డం పెట్టుకుని జగన్ తో కేంద్ర పెద్దలు ఓ ఆటాడుకుంటున్నారు. నైతికతకు పూర్తిగా తిలోదకాలిస్తూ… రాజకీయ, ఆర్ధిక అవసరాలకు జగన్ ను వాడుకుంటున్నారనేది విస్తృతంగా సాగుతున్న ప్రచారం. బాబాయ్ ను అతి కిరాతకంగా చంపినా , { ఆ విషయం ముందే తెలుసు అని చెపుతున్నారు} జగన్ కి మాత్రం నిందితుడు అవినాష్ బయటపడటమే అత్యంత ముక్యంగా కనిపిస్తోంది.
లిక్కర్ కేసు నుంచి కవిత.. తెలంగాన సీఎం కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు. ఆమెను అరెస్ట్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. కవిత అరెస్ట్ ఆపేందుకు కేంద్ర పెద్దలతో కేసీఆర్ తలొగ్గి,, భారీ ముడుపులు సమర్పించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కేసీఆర్ లాబీయింగ్ ఫలించి కవిత అరెస్ట్ నుంచి తప్పించుకుంది.
పై రెండు కేసులు ప్రస్తుత రాజాకీయ దుర్మార్గాలకు ఉదాహరణలు. ఇలాంటి దుర్మార్గాలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. తమ చెప్పు చేతల్లో ఉంటె కేసుల నుంచి బయట పడటం, లేకపోతె జైలుకు పంపడం.. ఇలాంటి దుర్మార్గాలు లెక్కకు మిక్కిలి జరుగుతున్నాయి. ఈ దారుణాలు నుంచి దేశాన్ని కాపాడాలంటే భగవంతుడినే వేడుకోవాలి. ఆయన కనికరించి వరకు వీళ్ళ ఆగడాలకు అడ్డు, ఆపు లేకుండా పోతుంది.