”ప్రపంచంలో అత్యంత దట్టమైన కీకారణ్యంగా పేరొందిన అమెజాన్ అడవుల్లో అద్భుతం.. 40 రోజులు తర్వాత సేఫ్గా నలుగురు చిన్నారులు… . పండ్లు, ఆకులు అలుములు తింటూ.. మృత్యువుతో యుద్ధం చేసి విజయం సాధించారు.క్రూర మృగాలు తిరిగే కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య నలుగురు పసివాళ్లు.. 40 రోజుల పాటు తమ ప్రాణాలను నిలుపుకున్నారు 13 ఏళ్లు, 9 ఏళ్లు, నాలుగేళ్లు, ఒక ఏడాది వయస్సున్న చిన్నారులు.. ప్రపంచంలోనే దట్టమైన అరణ్యంగా పేరుగాంచిన అమెజాన్ అడవుల్లో ప్రాణాలను నిలుపుకున్నారు. కొలంబియా అధ్యక్షుడు చేసిన ఈ ప్రకటనతో.. ఆ దేశ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి.. అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు సురక్షితంగా దొరకడం ఓ మిరకిల్..