”ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ కి చెందిన విశాఖ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ ఉదంతంపై తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా చర్చ జరిగినా.. పెద్దగా ఆశ్చర్య పోయినట్లు కనిపించడంలేదు..”
సీఎం జగన్ కి కానీ, వైసీపీ సర్కారుకి కానీ వ్యతిరేకంగా మాట్లాడినా, మాట్లాడకపోయినా కూడా.. అధికార పార్టీ పెద్దలకు అనుమానం వస్తే చాలు.. వాళ్ళు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా వాళ్ళకేమీ పట్టదు. ప్రజలు ఏమనుకుంటారో.. దేశ వ్యాప్తంగా ఆంధ్ర పాలనకు ఎంత చెడ్డ పేరొస్తుందో అనేవి ఇక్కడి పాలకులకు పట్టవు. అంతకంటా దారుణం ఏమంటే.. ఇక్కడి జనం కూడా ఇలాంటి వాటిపై పెద్దగా పట్టించుకోరన్న అపవాదు ఉంది. సాక్షాతూ .. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతాన్నే పరిశీలిస్తే ఇక్కడి జనంలో ఎంత నిర్లజ్జ ఉందొ ఇట్టే అర్ధం చేసుకోవచ్చు..
” జగన్ గత చరిత్ర, అవినీతి గురించి తెలిసిన జనమే ఆయనకు ఓట్లేసి గెలిపించారు. ఆ జనమే ఇపుడు అనుభవిస్తున్నారు. అయినా బుద్ది రాలేదు. మళ్ళీ ఆయనే గెలిచి.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే అపుడు తెలుస్తుంది..” అని ఓ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యల గురించి కాస్త ఆలోచించుకోవాలి.
విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం అధికార పార్టీ పెద్దల మద్దతులేకుండా ఎలా జరుగుతుందనేది ఎవరికన్నా వచ్చే అనుమానం. అక్కడ వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబం కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో ఉంటారు. అయినంత మాత్రాన కిడ్నాప్ చేసే అంత పరిస్థితి ఎందుకు వచ్చిందనేది అక్కడి జనానికి బహిరంగ రహస్యమే. ఈ కిడ్నాప్ వెనుక వందల కోట్ల భూలావాదేవీలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రంలో బీజేపీ సర్కారు జగన్ అరాచకాలకు అండగా నిలుస్తూ.. వారి ఆర్ధిక అవసరాలకు వాడుకుంటున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలకు ఇలాంటివి మరింత బలాన్ని చేకూరుస్తాయి.