”కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమ రవాణా ద్వారానే 15 వేల కోట్ల వరకు సంపాదించారని అంటున్నారు. ద్వారంపూడి ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ద్వారంపూడి అనుచరులు మట్టి ద్వారానే రోజు 2 కోట్లు దోచుకుంటున్నారు. భీమాస్ రెడ్డి అనేవాడు కూడా అక్రమాలకు ..పాల్పడుతున్నాడు.” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడలో పవన్ మాట్లాడారు. ఏపీలో దోపిడీ పాలన సాగుతుందని, జగన్ ని గద్దె దింపకపోతే రాష్ట్రం ఇంకా దారుణంగా దెబ్బ తింటుందని పవన్ వాపోయారు. జన సైనికులు, కాకినాడ ప్రజానీకం సహకరిస్తే ద్వారంపూడి గూండాగిరికి చెక్ పెడతామ్.. అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
కాకినాడ ఎమ్మెల్యే కౌన్ కిస్కా
‘‘కాకినాడ ఎమ్మెల్యే కౌన్ కిస్కా. బలమైన సమాజం కోసం జనసేన పార్టీ పెట్టా. జనవాణిలో కాకినాడ ఎమ్మెల్యేపై పలు ఫిర్యాదులు వచ్చాయి. . కౌన్ కిస్కా గాళ్లంటే నాకు భయం లేదు. క్రిమినల్స్ రాజ్యమేలుతుంటే నాకు ఇష్టం ఉండదు. ముఖ్యమంత్రి జగన్ దోపిడీదారుడు. సినిమా నటుడిగా ఉన్నందున 2009 నుంచి.. రాజకీయాలపై పూర్తీ స్థాయిలో దృష్టి సారించలేదు. 2009 నుంచి రాజకీయాలపై దృష్టి సారించి ఉంటే.. జగన్ను అధికారంలోకి రానిచ్చే వాడిని కాదు’’ అని పవన్కల్యాణ్ తెలిపారు.
ఇసుక దోపిడీ..లో జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దోచుకుంటున్న ఇసుక దోపిడీని ఆపగలిగి ఆ 10 వేల కోట్లను యువత ఉపాధికి వినియోగించుకోవచ్చన్నారు. జగన్ సర్కారు దోపిడీ ఆపగలిగితే రాష్ట్రం బాగుపడుతున్నారు.