”పాన్ ఇండియా డైరెక్టర్ SS రాజమౌళి పై బీజేపీ ఫోకస్ పెట్టింది. సినీ గ్లామర్, తెలివితేటలను ఉపయోగించుకోవడం ద్వారా 2024 సార్వత్రిక ఎన్నికలలో లబ్ది పొందాలని స్కెచ్ వేశారు..”
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఖమ్మంలో గురువారం నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా వచ్చారు.. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం పాపులర్ డైరెక్టర్ రాజమౌళిని అమిత్ షా ను కలిశారు. రాజమౌళిని అమిత్ షా కలవడానికి కారణం ఏంటనే విషయం మాత్రం బయటకు రాలేదు రుగా మణికొండలోని రాజమౌళి ఇంటికి అమిత్ షా వెళ్లి కలిశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్కు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ అవకాశం కల్పించింది. ఈ తరుణంలో రాజమౌళితో అమిత్ షా భేటీ కానుండటం హాట్టాపిక్గా మారింది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ను అమిత్ షా కలిశారు. ఆస్కార్ అవార్డు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.
ఎన్టీఆర్ తో కూడా..
గతంలో జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కావడంపై తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజుల పాటు జోరుగా చర్చ జరిగింది. ఇలా హైదరాబాద్ పర్యటనలకు వచ్చిన సమయంలో సినీ ప్రముఖులను అమిత్ షా కలవడం వెనుక రాజకీయం కోణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీకి సినీ గ్లామర్ తెచ్చేందుకే ఇలా సెలబ్రెటీలతో భేటీ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిననప్పుడు హీరో నితిన్తో పాటు భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో గతంలె సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీకి క్రేజ్ పెంచేందుకు అగ్రనేతలు రాష్ట్ర పర్యటనల సమయంలో సినీ, క్రీడా ప్రముఖులను కలుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజమౌళి సేవలను వినియోగించుకోవాలని అమిత్ షా భావిస్తున్నట్లున్నారు.. అని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు.