” ప్రతిపక్షాల కూటమి నాయకత్వాన్ని తనకు అప్పగిస్తే ఆ పార్టీల ఎన్నికల వ్యయాన్ని తానే భరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో హల్చల్బ చేసింది. కేసీఆర్కు అంత డబ్బు ఎక్కడిది? అని తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయ పక్షాలలో చర్చకు తెరలేచింది.
2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నికల ఖర్చు కోసం అప్పులు చేసిన ఇదే కేసీఆర్, ఈ తొమ్మిదేళ్లలో ఇతర పార్టీల ఎన్నికల వ్యయాన్ని భరించే స్థాయికి ఎలా ఎదిగారు? దేశంలో అధికారంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ వద్ద కూడా లేనంతగా కేసీఆర్ పార్టీ వద్ద వేల కోట్ల రూపాయలు ఎలా సమకూరాయి? ఎన్నికల బాండ్ల రూపంలో ప్రస్తుత బీఆర్ఎస్కు విరాళాలు ఇవ్వడానికి ప్రైవేటు కంపెనీలు ఎందుకు పోటీ పడుతున్నాయి? అసలు తెలంగాణలో ఏమి జరుగుతోంది?
ఆంధ్రాలో జగన్ దెబ్బకు తెలంగాణ రియల్ భూమ్..
. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులుగా ఉన్నవారు తెలంగాణ వనరులను చెరబట్టారని, భూములను కబ్జా చేశారని ఉద్యమం సందర్భంగా కేసీఆర్ అండ్ కో ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏ పాలకుడు కూడా సాహసించని విధంగా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అండ్ కో దోపిడీకి పాల్పడుతున్నారంటూ రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్న వైనం. అభివృద్ధి పేరిట భారీ దోపిడీకి తెర లేపారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని ఆరోపణలు.. 2019 ఎన్నికలలో ఏపీ కి జగన్ సీఎం అయిన తర్వాత ఇక్కడ ముక్యంగా రియల్ ఎస్టేట్ కుదేలయింది. కావాలనే జగన్ కూడా అలా వ్యవహరించినట్లు ప్రచారాన్ని కూడా నమ్మాల్సి వస్తోంది. ఎందుకంటే జగన్ కుటుంబానికి బెంగళూరు, హైదరాబాద్ లలో భారీ భూములు, ఆస్తులు ఉండటంవల్ల వాటి విలువ పెరిగేందుకు కూడా ఆంధ్రాలో ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ – జగన్ దోస్తీ… 2019 ఎన్నికలలో జగన్ కి కేసీఆర్ ఆర్ధిక సాయం చేసినట్లు పెద్ద ఎత్తున వినపడింది. కేసీఆర్ జగన్ కి ఎందుకు ఆర్థికంగా అండగా నిలబడ్డారో.. ఏపీని ఆర్ధికంగా ద్వాంసం చేస్తే అది తెలంగాణ దూసుకుపోవడానికి ఎలా ఉపయోగపడుతుందో.. త్వద్వారా కేసీఆర్ కి , అయన కుటుంబానికి వ్యక్తిగతంగా ఎంతటి ప్రయోజనం కలుగుతుందో ముందే ఊహించి ఇలా చేసారు. ఇది జగన్, కేసీఆర్ లకు మేలు జరిగినా ఏపీ ప్రజలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతోంది. మరి ఆంధ్రాలో ఎంతమంది దీనిని గమనిస్తున్నారా తెలియదు.