మూడోసారి కేంద్రంలో అధికారం కైవసం చేసుకునేందుకు మోదీ..అమిత్ షా ద్వయం రాజకీయ తరుణోపాయాలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ తో రహస్య స్నేహ హస్తం ఇస్తూనే, మరోవైపు చంద్రబాబుకూ ఆహ్వ్యనం పలకడాన్ని ఎలా భావించాలి? జగన్ కి కేంద్రం కేసుల పరంగా సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న అనుమానాలు ఏపీలో బలంగా ఉన్నాయి. జగన్ వైపు ఉంటూ చంద్రబాబును పట్టించుకోవాల్సిన పని బీజేపీకి లేదని అనుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ, ఎన్డీయే కు ఎదురు గాలి వీస్తోంది. ఈ స్థితిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలను చంద్రబాబు ఏకతాటిపైకి తేవడానికి మళ్ళీ రంగంలోకి దిగకుండా ముందే కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే మోదీ-షా ద్వయం జగన్ ని ఒళ్ళో కూర్చోబెట్టుకునే, చంద్రబాబుకూ రమ్మని ఆహ్వ్యనం పంపుతోంది.
బీజేపీ రాజకీయ వ్యవహారాలను నమ్మలేకపోతున్నా జగన్ కి కేసులు రీత్యా తప్పని పరిస్థితి. చంద్రబాబుకు సైతం ఏపీలో ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే బీజేపీతో తగవు పెట్టుకోకూడదు. ఈ పరిస్థితులలో వైసీపీ, టీడీపీ.. ఇద్దరిలోను బీజేపీ స్నేహం నటిస్తోంది. ఈ దోబూచులాటపై జనంలో అనుమానాలు ఉన్నా,, ఇక్కడ బీజేపీని ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో ప్రత్యక్షణంగా పోటీకి దిగే పరిస్థితి ఉండదు. వైసీపీ, టీడీపీ ఎవరు గెలిచినా బీజేపీ ఖాతాలోకే వెళతాయి.