టీడీపీ-జనసేన తో బీజేపీ పొత్తు ఉంటే ఎన్నికలలో తమకు అక్రమాలు చేయడానికి ఛాన్స్ ఉండదని జంకుతున్న వైసీపీ బ్యాచ్.. ఆ పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి రెండు శాతం ఓట్లు కూడా లేవు. అలాంటిది ఇక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేసినా… అందులో ఒకటి , రెండు గెలిచినా బోనస్ కదా.. అన్న భావనలో ఉన్న బీజేపీ పెద్దలు పొత్తుకు సై అంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి జగన్ .. రహస్య స్నేహితులతో కుయుక్తులు పన్ని పొత్తు చెడగొట్టాలని యత్నిస్తున్నా ఫలితం కనిపించడంలేదు.
రెండ్రోజులలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు అంశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
4 పార్లమెంట్-8 అసెంబ్లీ సీట్లు: ఆంధ్రప్రదేశ్ లో 4 పార్లమెంట్, 8 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి ఇప్పటికే టీడీపీ ద్రుష్టి సారించింది. రాజంపేట, తిరుపతి, ఏలూరు, రాజమండ్రి, అరకులోయ స్థానాల్లో నాలుగు సీట్లు బీజేపీకి కేటాయించే ఛాన్స్ ఉంది.
పొత్తు ఉంటే: బీజేపీ సహకారం లేకపోతే జగన్మోహన రెడ్డి, వైసీపీ అరాచకాలను అడ్డుకోలేమన్న ఆందోళనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలన్న తహతహతో ఉన్నారు. ఆత్మాభిమానం వంటి వాటిని పక్కనపెట్టి బీజేపీ పెద్దలు ఎపుడు కబురు పెడితే వెంటనే హస్తినకు వెళ్లి వాలిపోతున్నారు. పొత్తు ఉంటే టీడీపీకి ఎంత లాభమో.. బీజేపీకి కూడా అంతే ప్రయోజనం. కేంద్రంలో బీజేపీకి అయోధ్య అంశంతో సరిపడే మెజార్టీ వస్తుందన్న ధీమాతో ఉన్నా… మరోవైపు ధరల పెరుగుదల, జీఎస్టీ వంటివీ లోపాయికారిగా భయ పెడుతూనే ఉన్నాయ్. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేనలకు 20 వరకు పార్లమెంట్ స్థానాలు వస్తాయన్న సర్వేలు వైసీపీని భయపెట్టడంతోపాటు.. బీజేపీ పెద్దలను ఆలోచనలోకి నెడుతున్నాయి.