”రాష్ట్ర విభజన చట్టంలో మనకు రావలసిన హక్కులను రాబట్టడంలో చంద్రబాబు విఫలం అయ్యాడనే ప్రజలు చిత్తు చిత్తు గా ఓడించారు. భారీ మెజార్టీతో గెలిపించిన జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో పోరాడి మన హక్కులు తెలెకపొయారు. జగన్ ఐదేళ్ల పాలనకు ఇంక రెండు నెలలే ఉంది.. కేంద్రం నుంచి పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి రావలసిన వాటాల విషయంలో జగన్ ఎందుకు మొహమాటపడ్డారో ప్రజలకు చెప్పాలి.” అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లు మరో నాయకుడు చేస్తే పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు.
సాక్షాత్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి అసమర్ధతపై కుండబద్దలు కొట్టారు. పోలవరం ప్రాజక్ట్ విషయంలో పార్లమెంట్ లో వైసీపీ ఎందుకు హక్కుల కోసం ముక్కుసూటిగా మాట్లాడలేకపోయింది.. అంటూ ఉండవల్లి వైసీపీ ఎంపీలను ప్రశ్నించారు. పోలవరం పూర్తి కాకపొతే ఏపీ సాగునీటి అవసరాలు ఎలా తీరతాయంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ …జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరంపై ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ఇతర పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా.. వైసీపీ ఎందుకు భయపడుతోంది.. అంటూ ఉండవల్లి ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పలేక టెన్సన్ పడుతోంది.
ఉండవల్లి ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అయినా.. ఆయన మాటలకు, ప్రెస్ మీట్లకు ప్రాధాన్యత ఉంటుంది. ఇన్నాళ్లూ వైసీపీ, జగన్ అరాచకాలను సైతం వేనకేసుకు వచ్చిన ఉండవల్లి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో జగన్ పై వస్తున్న వ్యతిరేకతను గుర్తించి.. నాలిక మెలి తిప్పుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది కలిగేలా మాట్లాడుతున్న ఉండవల్లి.. తిరిగి ఆ నష్టాన్ని పూడ్చేందుకు మరో రూపంలో ప్రెస్ మీట్ పెడతారు.. అని ఆయన గురించి బాగా అవగాహన ఉన్న రాజమండ్రికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు సరదాగా వ్యాఖ్యానించడం గమనార్హం.
;”మద్యం అక్రమాలపై కూడా ఉండవల్లి నోరు విప్పాలి.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. చీఫ్ లిక్కర్ 75 రూపాయల బాటిల్ తయారీకి 10 ఖర్చు అవుతుందని.. మిగిలిన సొమ్ము దోచుకుంటున్నారని మాజీ ఎంపీ అరుణ్ కుమార్ లెక్కలతో సహా చెప్పేవారు. అలాగే ఇసుక, మైనింగ్ అక్రమాలపై కూడా ఉండవల్లి ఇష్టానుసారం లేనిపోని విమర్శలు చేసి.. జగన్ గెలుపు కోసం తన వంతు సహాయం అందించారు.. ఇపుడు జగన్ నాసిరకం మద్యంపై ఎందుకు మాట్లాడరు . ఇసుక అక్రమాలపై ఎందుకు నిలదీయరు.. జనం..జగన్ పై ఆగ్రహంగా ఉన్నారని.. ఆ ప్రభావం తనపై పడకుండా.. జగన్ ని విమర్శించినట్లు చిన్న పాయింట్ తీసుకుని జనాన్ని నమ్మిస్తున్నారు…” అని ఓ రాజకీయ విశ్లేషకుడు చెపుతున్నారు. దీనిపై ఉండవల్లి ఎలా స్పందిస్తారో చూడాలి.