రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో ఆమె పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. సామాజిక సేవ, ధాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా మూర్తి చేసిన కృషి అపారమైనదని ప్రధాని మోదీ కొనియాడారు. ఆమె రాజ్యసభలో ఉండడం మన ‘నారీ శక్తి’కి ఒక శక్తివంతమైన నిదర్శనమన్నారు.
ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు. సుధా మూర్తి రచయిత. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గానూ పద్మశ్రీని అందుకున్నారు. 2023లో పద్మ భూషణ్ కూడా లభించింది.