ప్రధాని మోదీజీ ప్రజాధరణ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్ ఆయనకు వచ్చింది. 78.5 శాతం ఆమోదం రేటింగ్తో మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారని మార్నింగ్ కన్సల్ట్ సర్వే వెల్లడించింది.
ఆ సంస్థ జనవరి 30.. ఫిబ్రవరి 5 మధ్య అభిప్రాయాలు సేకరించింది. ఈ డేటా ఆధారంగా మోదీ టాప్ ర్యాంకింగ్ లో నిలిచినట్లు వెల్లడించింది. అయితే ప్రాతినిథ్య నమూనాలకు పరమితులుంటాయని.. జనాభా తదనుగుణంగా మారుతూ ఉంటుందని తెలిపింది.