ఏపీ సీఎం జగన్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం ఇన్ చార్జి గా టికెట్ నిరాకరించారు. మరొకరిని నియమించారు. తాజాగా మరో విషయంలో ఆయనను పక్కన పెట్టారు. విశాఖకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి స్వాగతం పలికే బాధ్యతను అమర్ నాథ్ కు అప్పగించారు జగన్. అయితే ఈసారి ఆ బాధ్యతను మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.