ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి 394వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్రప్రభుత్వం కూడా మహారాష్ట్రలో వైభవంగా నిర్వహిస్తుంది. శివాజీ మహరాజ్ పరాక్రముడిగా, సాహసవంతుడిగా అనేక మంది విదేశీయులు, శత్రుమూకలను ఎదుర్కొని ఆదర్శవంతమైన పరిపాలన అందించారు. 350వ సామ్రాజ్య దినోత్సవం కూడా ఈ సంవత్సరం జరుపుకోబోతున్నాం.
మహారాష్ట్రలో శివాజీ పేరు మీద ఉన్న 8 పోర్టులను భారతప్రభుత్వం తరుఫున, సాంస్కృతిక శాఖా తరుఫున యునెస్కో గుర్తింపు కోసం యునైటెడ్ నేషన్స్ కు పంపడం గమనార్హం. యునెస్కో గుర్తింపు రావడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా శివాజీ మహరాజ్ స్ఫూర్తితో పని చేస్తానని చెప్పారు.
పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, హిందూ సామ్రాజ్యవాదం కోసం శివాజీ నిరంతర పోరాటం చేశారు. ఆయన అనుకున్నట్టు భారతదేశం కూడా ప్రపంచంలో శక్తివంతంగా ఎదగాలి. శివాజీ మహరాజ్ గారిని ఆదర్శంగా తీసుకుని దేశంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ముందుకు సాగుదాం.