భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది. ప్రధాని మోదీ సమక్షంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, బీహార్, హిమాచల్తో పాటు తెలంగాణలోని మిగతా 8 స్థానాలపై చర్చ జరిగింది.
అలాగే బీహార్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నందున అక్కడ అభ్యర్థుల జాబితా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బీహార్లో జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్ వర్గం) సహా ఇతర చిన్న పార్టీలు, తమిళనాడులో ఏఐఏడీఎంకే, ఒడిశాలో బీజేడీతో కుదిరిన పొత్తుల్లో ఇంకా సీట్ల సర్దుబాటు ఖరారు కాలేదు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం (TDP), జనసేన పార్టీలతో పొత్తులు, సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చినప్పటికీ.. ఏయే సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఈ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగలేదు. తెలంగాణలో 8, కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై మేధోమథనం జరిగింది. తెలంగాణలో చర్చించిన 8 సీట్లలో 7 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది.
ఆదిలాబాద్ – జి. నగేశ్
పెద్దపల్లి – శ్రీనివాస్ గోమాస
వరంగల్ – కృష్ణ ప్రసాద్ / ఆరూరి రమేశ్
మహబూబాబాద్ – సీతారాం నాయక్
ఖమ్మం – జలగం వెంకటరావు
నల్గొండ – సైది రెడ్డి
మెదక్ – రఘునందన్ రావు / అంజిరెడ్డి
మహబూబ్నగర్ – డీకే అరుణ / ఏపీ జితేందర్ రెడ్డి
ఈ పేర్లపై చర్చ జరిగగా వాటిలో ఒక స్థానం మినహా మిగతా 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ 2వ జాబితా విడుదల చేయనుంది.