భారత్ లో మొట్టమొదటి రైలు ప్రారంభమయింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ రైలు కోయింబత్తూర్ లో బయల్దేరింది. రేపు ఉదయం 7.25 నిమిషాలకు ఈ రైలు షిర్డీ చేరుకుంటుంది. ఒక్క రోజు విరామం తర్వాత తిరిగి శుక్రవారం షిర్డీలో రైలు కోయింబత్తూర్ కు బయల్దేరుతుంది. శనివారం మధ్యాహ్నం కోయింబత్తూర్ చేరుకుంటుంది. కోయింబత్తూర్ నుంచి సాయినగర్ షిర్డీ వరకు నడిచే ఈ భారత్ గౌరవ్ సర్వీసును సరదన్ రైల్వే ప్రైవేటుగా నిర్వహించనుంది. 1,100 మంది ప్రయాణికులకు ఈ రైలులో అవకాశం ఉంది. రైలు ప్రయాణం, హోటల్లో బస, అక్కడి సందర్శనీయ స్థలాలను చూపించడం, చారిత్రక ప్రదేశాల సందర్శన, టూర్ గైడ్స్ ను సర్వీసు ప్రొవైడర్ సమకూరుస్తుంది. ప్రయాణం, బస, ఆహారం అన్నీ టికెట్లో కలిసే ఉంటాయి.
భారత్ గౌరవ్ రైలు తిరుపూర్, ఈరోడ్, సేలం జోలార్ పేట్, బెంగళూరు యలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్ మీదుగా ప్రయాణిస్తుంది. మంత్రాలయం రోడ్డు వద్ద 5 గంటలు బ్రేక్ తీసుకుంటుంది. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వీలుగా ఇలా బ్రేక్ ఇస్తారు. థీమ్ ఆధారిత టూరిజానికి సంబంధించి రైల్వేలో ఔత్సాహిక వ్యాపార వేత్తలకు అవకాశాలున్నాయని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ‘భారత్ గౌరవ్’ తొలి రైలు సర్వీసు కోయింబత్తూర్ నుంచి సాయినగర్ షిర్డీకి బయల్దేరిదంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. వీడియోను కూడా షేర్ చేశారు. 2014 నుంచి 2022 మధ్య రైల్వేలో 3.5 లక్షల నియామకాలు జరిగాయని, మరో 1.5 లక్షల మందిని నియమించుకునే ప్రక్రియ ప్రారంభమయిందని అశ్వని వైష్ణవ్ తెలిపారు.