అయోధ్య రామమందిరాన్ని జనవరి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. దర్శించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. రోజూ 1.5లక్షల మంది వస్తున్నారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో తెలిపింది. శ్రీరామ జన్మభూమి మందిరంలో ఉదయం 6.30గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆలయ ట్రస్ట్ తెలిపింది.
శ్రీరామ జన్మభూమి మందిరంలో సాధారణంగా భక్తులు 60 నుంచి 75 నిమిషాల్లోనే ప్రభు శ్రీరామ్ లల్లా సర్కార్ దర్శనం చేసుకోవచ్చు. భక్తులు తమ మొబైల్ ఫోన్లు, పాదరక్షలు, పర్సులు తదితరాలను ఆలయ ప్రాంగణం వెలుపల ఉంచాల్సి ఉంటుంది. ఉదయం 4 గంటలకు మంగళ హారతి, సాయంత్రం 6.15 గంటలకు శృంగ హారతి, రాత్రి 10 గంటలకు శయాన్ హారతి కోసం భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ట్రస్ట్ తెలిపింది.