దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెండు గద్దలతో టీమ్ ఏర్పాటు చేశారు. వాటితో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని తెలంగాణ డీజీపీ రవి గుప్తా అలాకర్ తెలిపారు. మొయినాబాద్ లోని ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దలను పరీక్షించి చూశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి ఈగల్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు.
ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తించిన వెంటనే గాల్లోకి లేచిన ఓ గద్ద.. డ్రోన్ ను కాలితో పట్టుకుని నేల మీదికి తీసుకువచ్చింది. ఇలా శిక్షణ పొందిన గద్దలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, నెదర్లాండ్స్ తర్వాత తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్ ఉందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం ఈ గద్దలకు మూడేళ్లుగా శిక్షణ ఇస్తోందని చెప్పుకొచ్చారు. వీవీఐపీ సందర్శనలు, బహిరంగ సభలు, సమావేశాల సమయంలో భద్రతా విధులకు ఈగల్ స్క్వాడ్ ను వాడాలని నిర్ణయించినట్లు డీజీపీ రవి గుప్తా పేర్కొన్నారు.
https://x.com/sudhakarudumula/status/1768118369402949905?s=20