దుబాయ్ భారతీయుల కోసం ప్రత్యేక వీసా తీసుకొచ్చింది. అదే ‘మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసా’. భారత్ తో తమ బంధాన్ని బలోపేతం చేసుకొనేందుకు దీన్ని అమలులోకి తెచ్చింది. ఈ విషయాన్ని దుబాయ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం వెల్లడించింది.
దుబాయ్ ను గతేడాది 20.46లక్షల భారతీయులు సందర్శించారు. ఈ తాజా వీసా ద్వారా భారతీయులు 5ఏళ్లలో చాలా సార్లు వెళ్లి రావచ్చు. వెళ్లి నప్పుడు అక్కడ 90 రోజులు గడపే వీలుంది.