క్యాన్సర్ అంటే ఒక డేంజర్ సిగ్నల్ మనందరికీ.. ఆ మాట వింటేనే భయంతో మృత్యువాత పడినంత పనవుతుంది. ఆందోళనతో మరింత అనారోగ్యానికి గురవుతాం. ఇప్పుడు టాటా సంస్థ దానికి చెక్ పెట్టింది. క్యాన్సర్ చికిత్సపై పరిశోధనలో సంచలన విజయం సాధించింది.
రూ.100లకే టాబ్లెట్
క్యాన్సర్ రెండోసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది ‘టాటా ఇన్స్టిట్యూట్’. ఒక టాబ్లెట్ను అభివృద్ధి చేశామని టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. టాబ్లెట్ విలువ కేవలం రూ.100 అని చెప్పారు. దాని కోసం వైద్యులు 10ఏళ్లు కృషి చేశారని, రెండో సారి క్యాన్సర్ రాకుండా ఇది నివారిస్తుందని పేర్కొన్నారు.