” ఈజీగా ఉంటుందని ఇపుడు మనమంతా ప్రయాణాలలో ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నాం. ఇది చాలా డేంజర్ అని శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నా మనం పెడచెవిన పెడుతున్నాం.. కేన్సర్ వంటి అత్యంత ప్రమాదకర రోగాలను కొని తెచుకుంటున్నాం…”
ప్లాస్టిక్ బాటిల్ తో సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే మైక్రో ప్లాస్టిక్ తో అనారోగ్యాలు దరిచేరతాయి. దీంతో అందులో నీరు తాగడం సురక్షితం కాదు. కానీ చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంల ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలు చేసి తాగుతుంటారు. దీని వల్ల కాలేయం దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు సోకడం జరుగుతుంది.
ప్లాస్టిక్ బాటిళ్లు ఎండలో ఉంచడం వల్ల డయాక్సిన్ వంటి విష పదార్థాలు విడుదల అవుతాయి. ఆ నీరు మన ఆరోగ్యానికి మంచిది కాదు. రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందులోని నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మగవారు అయితే ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం మానుకోవాలి. లేదంటే వీర్య కణాల సంఖ్య తగ్గి సంతానం కలగకుండా చేస్తుందని చెబుతారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ ను మళ్లీ వాడటం అసలు సురక్షితం కాదు. ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకొచ్చి వాటిని ఫ్రిజ్ లో ఉంచుకుని మరీ వాడతారు. ఇది కరెక్టు కాదు. ఇలా చేయడం అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే. ప్లాస్టిక్ కు బదులు గాజు లేదా మెటల్ గ్లాసులో పోసుకుని తాగడం మంచిది. దీని వల్ల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
ప్లాస్టిక్ బాటిళ్ల కు బదులుగా రాగి, స్టీల్ బాటిల్స్ ఉత్తమం. ఇటీవల కాలంలో మట్టి (కుండ), వెదురు బాటిల్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయి. వాటిని కూడా ట్రై చేయవచ్చు.