డయాబెటిస్ టెస్ట్ లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. శరీరంలో చక్కెర స్థాయిలను తెలుసుకునేందుకు ఇకపై సూదితో గుచ్చి రక్తం తీసుకోవాల్సిన పనిలేదు. సరికొత్త విధానం దాదాపు అందుబాటులోకి వచ్చింది. పరీక్ష కోసం బెలూన్లాంటి సరికొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరంలో శ్వాసను ఊదితే అది ఆక్సిజన్, బీపీ వివరాలు చెబుతుంది. మధుమేహ స్థాయులను తెలియజేస్తుంది. ‘నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్’ అని పరికరానికి శాస్త్రవేత్తలు పెట్టారు.
ఈ పరికరం ద్వారా పరీక్షలు నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చినట్టు సీనియర్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రీతు తెలిపారు. ఈ నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్లో 10మల్టీ సెన్సార్లను అమర్చినట్టు చెప్పారు. రూ.16వేలకే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గుండెపోటు లాంటి ఇతర టెస్ట్ ప్రాణాంతక వ్యాధులను గుర్తించే సెన్సార్లు కూడా ఇందులో అమర్చబోతున్నామని కూడా వివరించారు.