ఇటీవల కాలంలో ఎక్కువమంది ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. అతి శ్రద్ద అవసరంలేదు కానీ, రోజూ సమతుల ఆహారం తీసుకుంటే చాలు. అనే విషయం తెలుసుకుంటే చాలు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆహారపరంగా అందరు పాటించాల్సిన 5 తేలికపాటి సూత్రాలను “అభిన్యూస్” పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇస్తున్నాం. శరీరానికి నిత్యం వివిధ బ్యాక్తీరియా, వైరస్ లతో పోరాడే శక్తి అవసరం. అంతెందుకు.. గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, కేన్సర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే.. మనం నిత్యం తినే తిండి పైనే ఆధారపడి ఉంటుంది.
1.ఆహారమే ఆధారం:
మన రోజువారీ ఆహారంలో వినియోగించే తెల్ల బియ్యాన్ని/గోధుమలను కొంతవరకు తగ్గించాలి. వీటి స్థానంలో జొన్న, రాగులు, సజ్జలు, మొలకెత్తిన విత్తనాలు వంటివి చేర్చుకోవాలి. బీన్స్, చిక్కుళ్ళు, తాజా ఆకుకూరలు, పండ్లు ఆహారంలో రోజూ ఉండేలా శ్రద్ద తీసుకోవాలి. వారంలో మూడు రోజులు ఆకుకూర తింటే మనల్ని వెంటాడే వ్యాధులు 40 శాతం దరిచేరవు. వేపుళ్లను తగ్గించి ఉడికించడం, ఆవిరి పెట్టె విధానాలు పాటించాలి. అలాగే ఖర్జురాలు, బాదం, పిస్తా, జీడిపప్పు వంటి నట్స్ రెగ్యులర్ గా తినాలి. బెర్రీస్.. గుండెకు మేలు స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్ప్బెర్రీ.. మొదలైన బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో బెర్రీలకు చోటివ్వడం ద్వారా గుండెను జాగ్రత్తగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
వాల్నట్లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ల పవర్ హౌస్ గా ఉండే ఈ వాల్ నట్ లు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడానికి తోడ్పడతాయి. శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. వీటితో హృద్రోగ ముప్పును తరిమేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
2.తిండిలో తెలుపు తగ్గాలి
మనం తినే ఆహారంలో ముక్యంగా పంచదార, ఉప్పు గణనీయంగా తగ్గించాలి. ఈ రెండు ఎక్కువైతే క్యాన్సర్, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉప్పు బదులుగా ఇటీవల చాలామంది సై0దవ లవణం వాడుతున్నారు. అది కూడా ఎక్కువ మోతాదులో వాడితే ప్రమాదమే. ఉప్పు ఎక్కువ తింటే.. రక్తపోటు (బీపీ) వస్తుంది. సగటున మనం రోజు 8-10 గ్రాముల ఉప్పు వినియోగిస్తున్నాం. అయితే 5 గ్రాముల కంటే ఎక్కువ సాల్ట్ వాడకూడదు.
3. నూనె, కొవ్వులు తగ్గాలి
మన బాడీకి కొంత కొవ్వు అవసరమే. అది మనం తినే అన్నం, టిఫిన్స్ లలో ఉంటుంది. అయితే మన ఆహార అలవాట్లతో అవసరాన్ని మించిన కొవ్వులు మన శరీరంలోకి చేరుతున్నాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ట్రై గ్లిజెరైట్స్ గణనీయంగా పెరుగుతాయి. మటన్, పీతల వంటి కొవ్వు ఎక్కువగా ఉండే పదార్దాల కంటే కొవ్వు తక్కువగా ఉండే కోడి మాంసం కాస్త బెటర్. రిఫండ్ ఆయిల్స్ బదులుగా నువ్వుల నూనె, వేరుశెనగ నూనె వంటివి వాడుకోవడం మంచిది. పిజ్జా, బర్గర్ వంటి కొవ్వులు , కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉండే వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
4. కూల్ డ్రింక్స్ కి దూరం..
పంచదార వంటి తీపి పదార్థాలతో పాటు కూల్ డ్రింక్స్,కి దూరంగా ఉండాలి. 200 మి.లీ. కూల్ డ్రింక్ లో 50-60 గ్రాముల పంచదార (చాకోలెట్ వంటి తీపిపదార్థాలు) ఉంటాయి. ఇవి రక్త సరఫరాను నెమ్మదింప చేస్తాయ్. పంచదారకు బదులుగా ఇటీవల ఎక్కువమంది బెల్లం వాడుతున్నారు. అది కూడా మోతాదు మించితే ప్రదమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యామ్మ్యంగా తేనే తీసుకోవడం చాలా బెటర్.
5. తగినన్ని నీళ్లు తాగాలి
ఆహారం కంటే ముక్యంగా మంచినీళ్లు తగినంతగా తాగకపోతే శరీరం రోగమయం అవుతుంది. బాడీలో తయారయ్యే టాక్షిన్స్ బయటకురాకుండా శరీరంలోనే పేరుకుపోతాయి. ఇటీవల నీళ్ల విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నారు. అయితే మనకు దాహం వేసినపుడు నీళ్లు తాగడం అనేది పురాతన కాలంగా ఉంది. అయితే.. ఉదయం నిద్ర లేచిన వెంటనే 2, 3 గ్లాసులు గోరు వెచ్చని నీళ్లు తాగడం అనేది ఆరోగ్యపరంగా చాల మంచిదని అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయ్.