శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది. తెలియక చేసిన పాపాలు కొంతవరకు ప్రాయచిత్తమవుతాయని భక్తుల విశ్వాసం.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని 2022 సంవత్సరంలో 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1,320 కోట్లు. శ్రీవారికి 1.08 కోట్ల మంది భక్తులు తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఈ ఏడాదికి గానూ 11.42 కోట్ల లడ్డూలు విక్రయం అయ్యాయి.
తిరుమలలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం ఆరునెలల పాటు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు వెల్లడించిన సంగతి తెలిసిందే. టీటీడీ ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు.