ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లోనూ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టు 49 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో రవీంద్ర జడేజా 46 నాటౌట్, రోహిత్ శర్మ 31, రిషభ్ పంత్ 26 తలో చెయ్యి వేయడంతో 170 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్మెన్ భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులు విసరడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భువీ 15 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు నేలకూల్చగా, బుమ్రా 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. ఇంగ్లండ్ జట్టు17 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం జరగనుంది.