దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనయుడు పీవీ ప్రభాకర్రావు ప్రత్యక్ష త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. పీవీ స్వగ్రామం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర. తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం సభ్యులు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బండారు రాంప్రసాద్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీనికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్తోపాటు ప్రభాకర్రావు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభాకర్రావు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామన్నారు. అనంతరం ప్రభాకర్రావు మాట్లాడుతూ.. తండ్రి పీవీ తరపున ఎన్నికల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు.