”అమ్మమ్మ.. అంటేనే అనురాగానికి మారుపేరు. వేసవి సెలవలలో అమ్మమ్మ ఇంటిదగ్గర గడిపిన జ్ఞాపకాలు అందరికీ మధురంగా ఉంటాయి. వయస్సు మళ్ళినా అమ్మమ్మ చనిపోతే బాధపడిపోతాం.. ” అలాంటిది డబ్బు కోసం ఏకంగా అమ్మమ్మనే హతమార్చి.. కుటుంబ విలువలకు పాతరేసిన ఓ యువకుడు..
బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసాడు మనవడు. ఎవరికీ అనుమానం రాకుండా కుట్ర పన్ని పాము కాటుతో హత్య చేసాడు. షాకింగ్ కి గురి చేస్తున్న ఈ ఘటన ఛత్తీస్ గఢ్.. రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో రాణి పాఠారియా అనే మహిళ 8 నెలల క్రితం పాము కాటుతో చనిపోయింది. 1 కోటి రూపాయలు బీమా సొమ్ము కోసం మనవాడే ఈ దారుణానికి పాల్పడ్డాడని తాజాగా బయటపడింది.
నిందితుడు ఆకాశ్ . . ఓ పాములు పెట్టె వ్యక్తికీ 30 వేల రూపాయల సుఫారీ ఇచ్చి పాము కాటుతో చంపించాడని పోలీసు పరిశోధనలో తేలింది. ఇందుకు సంభ0ధించిన ఆధారాలను సేకరించారు. విచారణలో ఆకాష్ ..అమ్మమ్మను హత్య చేయించినట్లు అంగీకరించాడు.
కోటీశ్వరుడిని కావాలనే ఆశతో తొలుత బీమా చేయించి పధకం ప్రకారం కొన్నాళ్ళు తర్వాత హత్య చేయించినట్లు తెలిపాడు. ప్రధాన నిందితుడు ఆకాష్, పాములు పట్టే వ్యక్తి, బీమా ఏజెంట్ లను పోలీసులు అరెస్ట్ చేసారు.
సమాజంలో అలాంటి వారు కూడా ఉంటారా?