రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్టు పోలీసులు తేల్చారు. పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్లో క్రిష్ పేరు ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. పార్టీ జరిగే సమయంలో వివేకానందతోపాటు రాడిసన్ హోటల్లో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు తెలిపారు. గజ్జెల వివేక్ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్ హాజరైనట్టు కూడా పోలీసులు కన్ ఫం చేశారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ వ్యవహారంలో మరికొందరు సెలబ్రిటీల పాత్రపైనా ఆరా తీస్తున్నారు.
డ్రగ్స్ పార్టీలో 10మంది ఉండగా దొరికింది ముగ్గురు. మిగిలిన ఏడుగురు గురించి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్రెండ్స్తో డ్రగ్స్ పార్టీ చేసుకున్నానంటూ పట్టుబడ్డ వివేకానంద అంగీకరించారు. సయ్యద్ అబ్బాస్ జఫ్రీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశామని చెప్పినట్లు సమాచారం. నిందితులు కొకైన్ ని పేపర్ రోల్ లో చుట్టి సేవించినట్లు గుర్తించారు పోలీసులు.