బకాయి ఫీజుల దోపిడీ తగదు..
కాలేజీ యాజమాన్యాలకు హెచ్చరిక
ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపించడంతో హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఫీజు ఒత్తిళ్లకు గురిచేస్తూ కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను మానసిక వేదనకు గురి చేస్తున్నాయని తెలంగాణ ఆల్ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్, ఏబీవీపీ నాయకుడు జీవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాల్ టికెట్లను అడ్డం పెట్టుకుని కార్పొరేట్ శక్తులు బలవంతంగా బకాయి ఫీజులను వసూలు చేయడం దారుణం అని వాపోయారు.
బకాయిల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. పరీక్షల ముందు విద్యార్థులను, తల్లిదండ్రులను కార్పొరేట్ మాఫియా వేధిస్తోంది. తమ వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారని పోలీసులను అడ్డం పెట్టుకొని దోపిడీ కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలు ఇంటర్మీడియట్ బోర్డు, డీఐఈఓలకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇంటర్మీడియట్ బోర్డు దాసోహం అంటూ పని చేస్తుంది. ప్రభుత్వం ఈ కార్పొరేటు దోపిడీని ఆపకపోతే ఉద్యమిస్తాం అని జీవన్ హెచ్చరించారు.