బర్మింగ్హామ్లో ఇండియా – ఇంగ్లండ్ జట్లమధ్య జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా మారింది. మొదటి ఇన్నింగ్స్లో స్పష్టమైన ఆధిక్యం కనబరచిన భారత్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఆ జోరు చూపలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించడంతో 245 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 378 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టులో జో రూట్ 76, జానీ బెయిర్స్టో 72 పరుగులతో అజేయంగా నిలవడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు బ్యాట్స్మెన్ ఇంకా 119 రన్స్ చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 7 వికెట్లు మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుదే పైచేయిగా ఉందని చెప్పాలి. భారత్ బౌలర్లు శ్రమించి వికెట్లు తీస్తేనే గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ వరుణుడు అడ్డుపడి ఆట నిలిచిపోతే డ్రా గా ముగిసే చాన్స్ ఉంది.