మనం తింటున్న ప్రతి ఆరు ముద్దల్లో ఒక ముద్ద చెత్తకుప్పల్లో చేరుతుందట. ప్రపంచవ్యాప్తంగా ఏటా 17% ఆహారం వృథా అవుతున్నట్టు ‘ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం’ (యూఎన్ఈపీ) ఆహార వృథా సూచిక-2021 ఆందోళన వ్యక్తం చేసింది. 2020లో 931 మిలియన్ టన్నుల (93.10 కోట్ల టన్నులు) ఆహారం వృథా అయినట్టు లెక్క గట్టింది. ఇది భారతదేశంలో ఉత్పత్తయిన ఆహారధాన్యాలు, నూనెగింజలు, చెరకు, ఉద్యానవన ఉత్పత్తులతో సమానమని విశ్లేషించింది. అత్యధికంగా ఆహారాన్ని వృథా చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 152 డాటా పాయింట్ల ఆధారంగా, 54 దేశాల్లో ఆహార వ్యర్థాల అంచనాలను గమనించి యూఎన్ఈపీ, బ్రిటన్కు చెందిన వ్రాప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఇటీవల ఈ నివేదికను విడుదల చేశాయి.
” ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. ” మనం వృధా చేసే ఆహారాన్ని పేదలకు పంచితే ఆకలితో అలమటిస్తున్న కొందరికైనా ఆకలి తీర్చవచ్చు. మనకు మిగిలిందే ఇవ్వక్కర్లేదు. పేదల కోసం మనం వండుకునే దాంట్లో కొంత అదనంగా వండి ఇవ్వడం అలవాటు చేసుకుంటే మనకు అది శ్రేయస్సు.
ఆహారం పాడవకుండా పేదలకు ఇవ్వాలి. మిగిలిపోయిన కూరలు ప్రిజ్ లో పెట్టుకుని తినే అలవాటు బాగా పెరిగింది. ఇది మన ఆరోగ్యంపైనా, మానసికంగానూ చాలా ప్రభావం చూపుతుందట. ప్రిజ్ లో పెట్టుకుని దాచుకుని ఆహారం తినే అలవాటున్న వారికీ 70% అధికంగా మధుమేహ వ్యాధి వస్తుందట. కేన్సర్,ఇతర ఉదరకోశ వ్యాధులకు ఇదే కారణమవుతుందట. పండగల సమయంలో వండుకునే పిండివంటలు.. నెలల తర్వాత పాడయ్యే వరకు డబ్బాలలో ఉంచి తర్వాత చెత్తకుప్పల్లో పారేయడం తెలుగు రాష్ట్రాలలో సంప్రదాయంగా వస్తోంది.
- ఆహార వ్యర్థాల సమస్య కేవలం ధనిక దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. అధిక, మధ్య ఆదాయ దేశాల్లోనూ చెప్పదగిన రీతిలో ఉంది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేయాలి.
- ఆహార వృధా విషయంలో పెద్దలు పాటించి.. చిన్నారులకు వివరించాలి. ఆహారం పండించడానికి రైతు పడే శ్రమ, ఆ ఆహారం లేకపోవడం వల్ల ఎంత మంది దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు.. వంటి అంశాలు వీలున్నపుడు పిల్లలకు తప్పకుండ ఓపిగ్గా చెప్పాలి.
- ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహార వ్యర్థాలు 8-10 శాతం కర్బన ఉద్ఘారాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీనివల్ల అనేక బాక్టరియ, వైరస్ కారక వ్యాధులకు కారణమవుతుంది.