ప్రజా పోరు పేరిట ఈ నెల 27న ఏలూరులో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హాజరు కానున్నారు. క్లస్టర్లోని ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, అమలాపురం జిల్లాల పరిధిలోని బీజేపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులతో నేరుగా ఆయన భేటీ అవుతారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. ఏలూరులోని సభా స్థలిని గురువారం పురందేశ్వరి, ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, పలువురు నేతలు పరిశీలించారు.
బీజేపీ ప్రజా పోరులో వైసీపీ పాలనలో జరిగే మోసాలను ప్రజల ముందుంచి నిలదీయడానికి వ్యూహం రుపొంచుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోకపోవడం.. , మద్య నిషేధం అమలు చేయకపోవడం…
ఈ క్రమంలోనే ఈ నెల 27న బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏలూరులో ”ప్రజా పోరు” పేరుతో బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ సభకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ సభకు హాజరయ్యే రాజ్నాథ్ సింగ్ క్లస్టర్లోని ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఏలూరు, కాకినాడ, అమలాపురం జిల్లాల పరిధిలోని బీజేపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభకు భారీ ఎత్తున జన సమీకరణకు బీజేపీ జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు.