మన ఫోన్ కు వచ్చే కాల్ ఎవరి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ట్రూకాలర్ యాప్ వాడాల్సి వస్తోంది. ఇక అంతకష్ట పడాల్సిన పనిలేదు యాప్స్తో సంబంధం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో ఇకపై స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. టెలికం ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) చేసిన ప్రతిపాదనలు త్వరలోనే అమలుకు నోచుకోనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) రెండేళ్ల క్రితం చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది.
అన్ని టెల్కోలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)ని అందించాలని ట్రాయ్ తన చివరి సిఫార్సుల సెట్లో ప్రతిపాదించింది. ఈ సర్వీసులు ఇండియాలో డిఫాల్ట్గా అందుబాటులోకి రానున్నాయి. సిమ్కార్డు తీసుకున్నప్పుడు నమోదు చేసుకున్న పేరు కాల్ చేసేటప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. యూజర్ అభ్యర్థనపై మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుందని చెపుతున్నారు.