టీ వేడిగా లేదని అత్త గొడవ.. ఇనుప రాడ్తో కొట్టి చంపిన కోడలు వేడి టీ ఇవ్వనందుకు దూషించిందని అత్తను ఇనుప రాడ్తో కొట్టి చంపేసింది ఓ కోడలు. తమిళనాడులో ఈ దారుణ ఘటన జరిగింది. మరోవైపు, గుజరాత్లో ఓ వ్యక్తి.. యోగా చేస్తూ ఛాతీ నొప్పి వచ్చి ఒక్కసారి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తమిళనాడులోని పుడికొట్టాయి జిల్లాలోని విరళీమలై సమీపంలో జరిగింది ఈ సంఘటన. పళని అమ్మాళ్ అనే మహిళ టీ తెమ్మని తన కోడలైన్ గణకకు చెప్పింది. టీ వేడిగాలేదని కోడలిని అత్త మందలించింది. వెంటనే కోడలు ఇనుప రాడ్ తో అత్త ను కొట్టి చంపింది.