కరోనా కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయిన వారికి వీసాలను అందించనున్నట్లు చైనా ప్రకటించింది. వీసాలకు ఓకే చెప్పింది. చైనా యూనివర్సిటీల్లో చదివే భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు తిరిగి తమ దేశానికి వచ్చేందుకు అనుమతించే ప్రక్రియను వేగవంతం చేసినట్టు ప్రకటించింది. దాదాపు రెండేళ్ల తర్వాత కొవిడ్-19 వీసా విధానాన్ని సోమవారం అప్డేట్ చేసింది భారత్లోని చైనా రాయబార కార్యాలయం. తమ దేశంలో పనిచేసే అన్ని రంగాల్లోని విదేశీయులు, వారి కుటుంబసభ్యులు తిరిగి చైనా వచ్చేందుకు వీసా దరఖాస్తులను ఆమోదించనుంది. దీంతో 2020 నుంచి భారత్లోనే చిక్కుకుపోయిన వందలాది మంది భారత వృత్తి నిపుణులకు ఉపశమనం దక్కనుంది.