సాధారణంగా నవంబర్ నెల వచ్చిందంటే చలి మొదలవుతుంది. అంటే శీతాకాలం.. చలిచలి వాతావరణంలో దీపావళికి సన్నద్ధమయ్యే సమయం. ఇదే నెలలో కార్తీక మాసం కూడా. . కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశంలో ఎక్కడా శీతాకాలం ఫీలింగ్ కనిపించడం లేదు. హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి. ఈ వేడి వాతావరణానికి ప్రధాన కారణం ఎల్నినో. విపరీతమైన ఉష్ణోగ్రతల్ని పెంచేస్తున్న ఎల్నినో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించడంతో 2024 కూడా ఎండలు మండే కాలమే అని తేలిపోయింది. ఎల్నినోతో విపరీతమైన వేడి మధ్య పసిఫిక్ మహా సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఎల్నినో ఏర్పడుతుంది. రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి ఈ ఎల్నినో ఏర్పడి 9 నుంచి 12 నెలలపాటు ప్రభావం చూపుతుంది. ఈసారి ఇంకాస్త ఎక్కువే ఉండేలా కనపిస్తోంది. భూమ్మీద, సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలను పెంచేసే ఎల్నినో వల్లే ఇంత వేడిగా ఉంటోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్నినో 2024 ఏప్రిల్ వరకు ఉంటుదని, ఉష్ణోగ్రతలను పెంచేస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) ప్రకటించింది. Also Read – చేతులు కట్టేసి.. చెట్టుకు ఉరేశారు.. బెంగాల్లో బీజేపీ నేత హత్య వర్షాలకూ ఎఫెక్టే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాల కాలంలో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కరవు ఛాయలు వచ్చేశాయి. తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడబోతోంది. ఎల్నినో వచ్చే ఏడాది నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది.
ఆహార సంక్షోభ భయం.. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల ప్రపంచానికి ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా రెండేళ్లపాటు తగినంత వర్ష పాతం లేకపోతె 30-40 శాతం ప్రజలు ఆహార కొరతతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కొన్ని అరుదైన పరిస్థితులలో ఎల్ నినో ప్రభావం ఏడేళ్ల వరకు కూడా ఉండే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.