సమాచార ప్రసార శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, శాంతి భద్రతలకు, మర్యాదకు, నైతికతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు(అక్రిడిటేషన్) రద్దు చేస్తామని సమాచార ప్రసార శాఖ ప్రకటించింది. ఈ మేరకు పీఐబీ అక్రిడిటేషన్ మార్గదర్శకాలను వెలువరించింది. దీని ప్రకారం ఆన్లైన్ మీడియా కంపెనీల్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ ఇస్తుంది. న్యూస్ అగ్రిగేటర్లలో పనిచేసే జర్నలిస్టులకు మాత్రం ఇవ్వరు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే జర్నలిస్టులతో పాటు కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారు, పరువు నష్టం కేసులో దోషులుగా తేలినవారు, నేరాన్ని ప్రేరేపించేలా వ్యవహరించే వారు కూడా అక్రిడిటేషన్ను కోల్పోవాల్సి ఉంటుంది. అక్రిడిటేషన్ కోసం తప్పుడు పత్రాలు సమర్పించినా, అలాంటి పత్రాలను అనుమతించిన మీడియా సంస్థ కూడా 2 – 5 సంవత్సరాల పాటు అక్రిడిటేషన్ అర్హత కోల్పోతుంది.