అయోధ్యలోని సరయు నదీ తీరంలోని బాల రామక్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాముడు అందరి వాడంటూ ముస్లిం భక్తులు సైతం దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరుతున్నారు. మత సామరస్యం పెంపొందించేందుకు ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన సద్భావ యాత్రలో భాగంగా అయోధ్యలోని రామమందిరానికి వందలాది మంది ముస్లింలు తరలివచ్చారు. వారంతా కాషాయ జెండాలను పట్టుకుని ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. రాముడు తమకు ప్రవక్త లాంటివాడన్నారు. “మా మధ్య ఎలాంటి వివక్ష భావం లేదు. రాముడిని చూడడానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రామ్ లల్లా ప్రాంగణానికి రావడం నిజంగా చాలా బాగుంది” అని ఒక ముస్లిం భక్తుడు అన్నారు.
ముస్లిం రాష్ట్రీయ మంచ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై 74 శాతం మంది ముస్లింలు సంతోషంగా ఉన్నారని పేర్కొంది. ప్రతి భక్తుడి మదిలో రాముడు దైవం అందరిదీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతేకాదు ప్రధాని మోదీ చెప్పిన మాటలు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వింటుందని ముస్లిం రాష్ట్రీయ మంచ్ పేర్కొంది.
ఉలేమాలు, మౌలానాలు అని పిలవబడే వారు ఇస్లాం పేరుతో తమ రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్నారని.. అలంటి ప్రతిపక్ష నాయకులను పూర్తిగా బహిష్కరించాలని అసంఖ్యాక ముస్లింలు కోరుకుంటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. అయోధ్య రామ మందిరం హిందువుల విశ్వాసానికి కేంద్రమని, మెజారిటీ జనాభా విశ్వాసాన్ని గౌరవించాలని స్పష్టం చేసింది.