”కమలం పార్టీ కేడర్ కదనోత్సాహంతో ఉరకలేస్తోంది. పూర్వ ఉభయగోదావరి జిల్లాల పరిధిలో 5 లోక్ సభ స్థానాల పరిధిలో బూత్ లెవల్ కార్యకర్తల సమ్మేళనం.. ఏలూరులో జరిగింది. గోదావరి జిల్లాలలో ఎన్నడూ లేని రీతిలో ఏలూరు సభ గ్రాండ్ సక్సెస్ అయింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసారు.
మోదీ సర్కార్ పదేళ్ల పాలనా కాలంలో సాధించిన విజయాలను రాజ్ నాధ్ బీజేపీ బూత్ సభ్యులతో పంచుకున్నారు. చంద్రయాన్ ఫెయిల్ అయినపుడు శాస్త్రవేత్తలు బృందాన్ని భుజం తట్టి ప్రోత్సహించడం దగ్గర నుంచి.. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడం వంటి అనేక కీలక ఘట్టాలను రాజ్ నాధ్ ఏలూరు సదస్సులో గుర్తు చేసుకున్నారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం. ఏలూరు పార్లమెంట్ స్థానాల నుంచి ;పది వేల మంది బీజేపీ కుటుంబ సభ్యులు నినాదాలతో ఏలూరు సభ హోరెత్తింది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఈ సదస్సును సక్సెస్ చేయడంలో సఫలం అయ్యారు. ”బీజేపీ కుటుంబ సభ్యుల సహకారంతోనే రాజ్ నాధ్ సింగ్ గారి సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది… బీజేపీ నాయకులందరికీ కృతజ్ఞతలు..” అని చౌదరి చెప్పారు. ఇదే స్పూర్తితో ఎన్నికల సమరంలోనూ దూసుకుపోవాలని గారపాటి పిలుపునిచ్చారు.
ఏలూరు పార్లమెంట్ పరిధిలో బీజేపీ పటిష్టత కోసం గారపాటి చౌదరి మూడేళ్ళుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 16 ఏళ్ళ క్రితం ”తపన” పేరుతో గారపాటి చౌదరి ఫౌండేషన్ ను స్థాపించారు. తపన ఫౌండేషన్ ద్వారా.. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు సరఫరా, పారిశుధ్య0, పేద కుటుంబాలలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, కుట్టు శిక్షణ, బాలబాలికలకు కరాటే వంటి వాటిలో శిక్షణ, వేల మంది మహిళలకు కోలాటం శిక్షణ వంటివి నిరంతరం చేస్తూనే ఉన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు ఆటంకం కాకుండా స్కాలర్ షిప్స్ ఇవ్వడం.. ఇలా దశాబ్ద0న్నర కాలంగా చౌదరి సేవలు కొనసాగిస్తున్నారు.