”తనను చంపేస్తామని ఫేస్ బుక్, సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారంటూ రెండ్రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఫిర్యాదు చేసారు.
తాజాగా .. ఏపీ సీఎం జగన్ సొంత చెల్లెలు షర్మిల కూడా తనకు ప్రాణహాని ఉందన్న అర్ధం వచ్చేలా మాట్లాడి సంచలం సృష్టించారు.
తన భద్రత విషయంలో ఏపీ సీఎం జగన్పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఏదో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం చూస్తుంటే.. .. తన చెడు కోరుకుంటున్నారనేగా అర్థం అని అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన వైఎస్ షర్మిల.. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సీరియస్ కామెంట్స్ చేశారు. షర్మిల కామెంట్స్ పై ముఖ్య0గా రాయలసీమ వాసులలో జోరుగా చర్చ సాగుతోంది