ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం జగన్ ను గద్దె దింపేందుకు కంకణం కట్టుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే ఏపీకి మేలు. బీజేపీ తప్పనిసరిగా బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంపై జరుగుతున్న ప్రచారాలపై ఆయన స్పందించారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నారు. త్వరలోనే పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు. ప్రజలకు మేలు చేసే చట్టాలు చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ కూడా మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని, పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.