జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ సెడాన్ ఐ4 ఎలక్ట్రిక్ కారును భారత్ లో ప్రవేశపెట్టింది. ఈ కార్ లో ఫీచర్లు అద్భుతం. 340 హెచ్పీ సామర్థ్యంతో.. కేవలం 5.7 సెకన్లలోనే 100 కి.మీ. వేగం అందుకుంటుంది. 80.7 కిలోవాట్ అవర్ లిథియమ్ అయాన్ బ్యాటరీతో దీన్ని తయారు చేశారు. ఈ కారును ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. జులై నుంచి డెలివరీలు ప్రారంభించనున్నారు. ప్రారంభ ఆఫర్ కింద బీఎండబ్ల్యూ వాల్బాక్స్ ఛార్జర్ను ఇన్స్టలేషన్తో సహా అందించనున్నారు. దీంతో ఇంటి దగ్గరే 11 కిలోవాట్ల వరకు సురక్షితంగా ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
సెడాన్ ఐ4 e కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.69.9 లక్షలు. వచ్చే ఏడాది విక్రయించే మొత్తం వాహనాల్లో 10 శాతం పైనే విద్యుత్ వాహనాలు ఉంటాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పావ్ అంచనా వేశారు. “విద్యుత్తు ఎస్యూవీ ఐఎక్స్, లగ్జరీ హ్యాచ్బ్యాక్ విద్యుత్ మినీ ఎస్ఈ లను విడుదల చేసినపుడు మా మొత్తం విక్రయాల్లో 5 శాతం వరకు ఈవీలకు గిరాకీ కనిపించింది.