హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్ఫూర్తిగా తీసుకున్నారు ముగ్గురు నిందితులు. వారు ఖరీదైన కార్లను దొంగిలించారు. ఇలా ఒక్కనెలలో ఏకంగా 40కు పైగా లగ్జరీ కార్లను కొట్టేశారు. అందుకోసం స్కానర్లు, జీపీఎస్ జామర్ సహా హైటెక్ పరికరాలను వాడారు. నిందితులు నిన్న పోలీసులకు పట్టుపడ్డారు. మనీశ్ రావు, జగ్దీప్ శర్మ, ఆస్ మహమ్మద్ నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిలో మనీశ్ రావు, జగ్దీప్ శర్మ దిల్లీలోని ఉత్తమ్నగర్కు చెందినవారు. ఆస్ మహమ్మద్ యూపీలోని మేరఠ్కు చెందిన వాడు. పశ్చిమ్ విహార్ ప్రాంతం నుంచి దొంగిలించిన కారును రావు, శర్మ.. విక్రయానికి తీసుకొచ్చినప్పుడు వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అపహరణకు గురైన వాహనంలో చేసిన సోదాల్లో సెన్సార్ కిట్, మాగ్నెట్, ఎల్ఎన్టీ తాళాలు, 8 రిమోట్ కార్ తాళాలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు రెండు తుపాకులు, టూల్కిట్స్, హ్యాకింగ్ డివైజ్, ఏడు కార్లు సహా 30 కార్లకు చెందిన తాళాలు నిందితుల వద్ద లభ్యమయ్యాయి.