యూపీఏ టైంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానిగా ఎవరున్నా ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెనక ఉండి చక్రం తిప్పేవారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో జవాబుదారీతనం లేదని విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలను ఏ నేతా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. యూపీఐ హయాంలో ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని పోల్చుతూ విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆమె లోక్సభలో మాట్డాలాడారు. సోనియా అనాలోచిత నిర్ణయాలతోనే ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని విమర్శించారు.
అంతే కాదు రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు అడ్డదారిలో కీలక ఫైళ్లను అప్పగించారని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రంలో ఉన్న ప్రతి అంశం నిజమైనదేనని, సాక్ష్యాధారాలతో సహా వాటిని నిరూపిస్తామని సవాలు విసిరారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికీ దేశ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక దేశ రక్షణకు బడ్జెట్లో నిధులను గణనీయంగా పెంచామని నిర్మల చెప్పారు.