అక్టోబర్ ఒకటి నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగులను (నాలుగు సీట్లతోసహా రెండు సైడ్ ఎయిర్ బ్యాగ్లు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల కార్లు ధరలు పెరుగుతాయని , దాని వల్ల కొనుగోలుదారులు దూరమయ్యే అవకాశం ఉందని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అయినా కేంద్రం మాత్రం తగ్గేదేలే అంటూ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పట్టుదలగా ఉంది. దీంతో నిబంధనలకు తుదిరూపు తెచ్చేందుకు కసరత్తు చేస్తోందన్న మంత్రిత్వశాఖ ముఖ్య అధికారులుచెపుతున్నారు.
ఖర్చు తక్కువే..: ఇప్పటికే అన్ని కార్లలో 2 ఎయిర్బ్యాగ్ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరిగా ఉండగా.. మరో నాలుగింటి ఏర్పాటు వల్ల అదనంగా వినియోగదారుడికి 75 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు కాదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ కార్ల తయారీ సంస్థలు మాత్రం ఇందుకు 231 డాలర్ల అదనపు ఖర్చు అవుతుందని చెబుతున్నట్లు సమాచారం. అయితే, తయారీ సంస్థల వాదనను తోసిపుచ్చుతోన్న కేంద్ర ప్రభుత్వం.. విదేశాలకు ఎగుమతి చేసే కార్లకు అదనపు ఎయిర్ బ్యాగ్లను అమర్చుతున్నప్పటికీ స్థానికంగా అమ్ముతున్న వాటిలో మాత్రం ఆ ఏర్పాటు చేయడం లేదని అభ్యన్తరం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రకటన చేసిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. ప్రమాదాలను నివారించేందుకే కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నామని అన్నారు. ప్రమాద సమయంలో కార్లలో ఎయిర్బ్యాగులు ఉన్నట్లయితే కేవలం ఒక్క ఏడాదిలోనే 13వేల ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని గుర్తు చేశారు. ఇప్పటికే వీటిని రవాణాశాఖ నోటిఫై చేసిందన్న ఆయన.. అక్టోబర్ 1 నుంచి నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసారు.