Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home తెలంగాణ

జీవో 111 ఎత్తేసిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్ కి సురక్షిత తాగునీరు ఇక అనుమానమే..84 గ్రామాల పరిధిలో రియల్ ఎస్టేట్ ఇక దూకుడే

V Srinivas by V Srinivas
April 20, 2022
in తెలంగాణ
జీవో 111 ఎత్తేసిన తెలంగాణ సర్కార్

దశాబ్దాలుగా  అమలులో  ఉన్న జీవోను తెలంగాణ సర్కారు ఎత్తివేసింది.  భాగ్య నగరానికి తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందు చూపుతో తీసుకువచ్చిన జీవోను రద్దు చేయడంపై పలువురు వ్యతిరేకిస్తున్నారు.  అయితే ఈ ఎత్తివేత వల్ల బెనిఫిట్ పొందుతున్న 84 గ్రామాల్లో భూములు ఉన్న వారు మాత్రం రియల్ భూమ్ వస్తుందన్న ఆనందంతో ఉన్నారు. 

111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా  జీవో జారీ చేసింది. 84 గ్రామాలకు 111 జీవో నిబంధనల నుంచి విముక్తి లభించినట్లయింది.  గ్రేటర్ హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్​మండలాలు పూర్తిగా.. వికారాబాద్ జిల్లాలోని శంకర్​పల్లి, చేవెళ్ల, షాద్​నగర్, షాబాద్​ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు ట్రిపుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్… చివరికి జీవో నెంబర్‌ 111 ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ వన్ జీవో రద్దుపై సీఎఎస్ నేతృత్వంలో కమిటి కూడా వేసింది తెలంగాణ ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ అధికారులతో కలిసి కమిటిని ఏర్పాటు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నది, ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా గ్రీన్‌జోన్స్ డిక్లేర్ చేస్తూ… మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ జీవో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించింది. జంట జలాశయాలు కలుషితం కాకుండా సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్ పట్టణానికి తాగు నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది.  జీఓ నెంబర్‌ 111.. సుమారు 25 ఏళ్ల నుంచి వినిపిస్తున్న ప్రభుత్వ ఆర్డర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూసీ నదితో పాటు, హైదరాబాద్‌కు తాగునీరందించిన జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వం 1996లో ట్రిపుల్ వన్ జీవోను తీసుకొచ్చింది.  తాజాగా ట్రిపుల్‌ 111 జీవో ఎత్తివేస్తూ కేబినెట్‌ తీర్మానం చేయడంతో ఆ పరిధిలోని 84 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మోక్షగుండం ముందు చూపుతో…1996 నాటికి హైద‌రాబాద్ అభివృద్దిని అంచ‌నా వేసి తాగునీటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌నే ఉద్దేశంతో.. జంట జలాశయాలను కాపాడటానికి ఉమ్మడి రాష్ట్రంలో  111 జీవోను తీసుకొచ్చారు.  లక్షా 32 వేల ఎకరాల భూమి, 84 గ్రామాల్లో విస్తరించి ఉంది. 1908లో ప్రముఖ ఇంజనీర్  మోక్ష‌గుండం విశ్వేశ‌ర‌య్య హైద‌రాబాద్ కు వ‌చ్చే వ‌ర‌ద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఉస్మాన్ సాగ‌ర్, హిమ‌య‌త్ సాగ‌ర్ ను నిర్మించారు.  4 వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉన్న న‌గ‌రానికి  పైపులతో మంచి నీళ్లు అందించేలా ప్లాన్ చేశారు. అయితే తాగునీరు కలుషితం  కాకుండా ఉండాలని,  ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు,  ఫ్యాక్టరీలు పెట్టినా పర్యావరణం దెబ్బతింటుందని అప్పటి ప్రభుత్వం  111 జీవోకి ప్రాణం పోసింది.  ఇప్పుడు అది ఎత్తివేసింది టీఆర్ఎస్  ప్రభుత్వం.

ఈ జీవో ఎత్తివేత ద్వారా హైద‌రాబాద్ కిజీవనాడి లాంటి  జ‌లాశ‌యాల‌కు ఊపిరి తీసినట్లేనన్న  విమర్శలు వస్తున్నాయి.  నిజానికి 111 జీవో ప్రకారం ఈ 84 గ్రామాల్లోని వ్య‌వ‌సాయ భూముల్లో ఎలాంటి భ‌వంతులు నిర్మించ‌రాదు. లే అవుట్స్ ఏర్పాటు చేయ‌కూడ‌దు. చెక్ డ్యాములు, లిప్ట్ ఇరిగేష‌న్ ప‌నులు చేప‌ట్ట‌కుండా స్థానిక సంస్థల ఆథారిటీకి ఆ బాధ్య‌త ఇచ్చారు. అయితే.. చాలావరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఈ జీవో ఎత్తివేతతో ఇకపై ఇంకా పెద్ద పెద్ద భవంతులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ భూముల్లో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు వందల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు సదరు బడా నేతలకు  లబ్ధి చేకూర్చేందుకే జీవోను రద్దు చేశారని  ప్రతిపక్ష నేతలు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా  విమర్శిస్తున్నారు.

Tags: Telangana sarkar Go
ShareSendShareTweet
Previous Post

బాహుబ‌లిని దాటేసిన రాకీభాయ్‌..?

Next Post

క‌రోనా నాలుగో వేవ్ పొంచి ఉందా..?

Related Posts

ఉపరితల ఆవర్తనం..  నేడు వర్షాలు
ఆంధ్రప్రదేశ్

ఉపరితల ఆవర్తనం..  నేడు వర్షాలు

May 16, 2022
28 ఏళ్ల తర్వాత క్లాస్ మీట్స్ తో  కేటీఆర్
తెలంగాణ

28 ఏళ్ల తర్వాత క్లాస్ మీట్స్ తో కేటీఆర్

April 30, 2022
కేటీఆర్ వ్యాఖ్య‌ల వెనుక మర్మమేమిటి? . ఏపీ మంత్రులు ఎందుకు  ఫైర్‌?
ఆంధ్రప్రదేశ్

కేటీఆర్ వ్యాఖ్య‌ల వెనుక మర్మమేమిటి? . ఏపీ మంత్రులు ఎందుకు ఫైర్‌?

April 30, 2022
Next Post
క‌రోనా నాలుగో వేవ్ పొంచి ఉందా..?

క‌రోనా నాలుగో వేవ్ పొంచి ఉందా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

ఆస్తులు వదులుకుని, ఆధ్యాత్మిక మార్గంలో

ఆస్తులు వదులుకుని, ఆధ్యాత్మిక మార్గంలో

by Chaitanya B
May 18, 2022

ఆ చిన్నారులకు 3 సార్లు పెళ్లిళ్లు

ఆ చిన్నారులకు 3 సార్లు పెళ్లిళ్లు

by Aruna
May 14, 2022

దేవాలయాలే, మసీదులుగా మారాయి..

దేవాలయాలే, మసీదులుగా మారాయి..

by V Srinivas
May 18, 2022

పూజారి కోసం  కృష్ణుడు కూర్చున్నాడు

పూజారి కోసం కృష్ణుడు కూర్చున్నాడు

by V Srinivas
May 18, 2022

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved