ప్రధాని మోదీ వర్చువల్ గా సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. 12 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది.
అయితే ఈ రైలు గురువారం నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య రెండో రైలు. మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది.